Tuesday, August 11, 2020

బహుజన రాజకీయ చైతన్య స్ఫూర్తి గాజుల లక్ష్మీనరసు శెట్టి

 



ఇండియాలో మొట్ట మొదటి బహుజన రాజకీయ చైతన్య స్ఫూర్తి గాజుల లక్ష్మీనరసు శెట్టి. జోతిరావు ఫూలె సామాజి సంస్కరణ, విద్యా రంగం పై దృష్టిని కేంద్రీకరిస్తే గాజుల ఈస్టిండియా కంపెనీ దుర్మార్గాలపై గళమెత్తిండు. తన ఉద్యమాలతో బ్రిటీష్ పార్లమెంటుని కదిలించిండు. ఈస్టిండియా కంపెనీ వారి ఏకపక్ష పాలనను నిరసించేందుకు క్రిసెంట్ అనే ఆంగ్ల పత్రికను 1843లోనే స్థాపించిండు. మద్రాసు కేంద్రంగా పనిజేసిండు. చిన్నయసూరి లాంటి బ్రాహ్మణేతర పండితులను ప్రోత్సహించిండు. ఈయన బలిజ కులానికి చెందిన తెలుగు వాడు. మద్రాసులో పేరు మోసిన సిద్దులు అండ్ కంపెనీ ఓనర్. అయితే పత్రిక నిర్వాహణ మూలంగా ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా తాను నమ్మిన సిద్ధాంతం కోసం 1868 లో చనిపోయే వరకు కృషి చేసిండు. ఇప్పుడీ పుస్తకాన్ని అచ్చు వేసేందుకు మిత్రులు ఆర్థికంగా సహకరిస్తే ఎక్కువ కాపీలూ వేయడానికి వీలవుతుంది. సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తూ..

No comments:

Post a Comment

Vattikota natikalu